Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ఇంకా వీవీ ప్యాట్లు లెక్కించాల్సి ఉందని ఆ తర్వాతే అఫిషియల్గా ఫలితాలు ప్రకటిస్తామని అన్నారు. ఎన్నిక నిర్వహణలో ఒకరిద్దరు తప్పులు చేసి ఉంటే వాళ్లకు చట్ట పరంగా శిక్ష తప్పదన్నారు. కౌంటింగ్ హాల్లో ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుందని కౌంటింగ్ సమయంలో హడావుడి చేస్తే తప్పులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎక్కడ పక్షపాతం లేకుండా ఎన్నికలు ముగించామని వికాస్ రాజ్ అన్నారు. నవంబర్ 8న మునుగోడులో ఎలక్షన్ కోడ్ ముగుస్తుందని వెల్లడించారు. ప్రొసీజర్ ప్రకారమే ఆర్వో ఫలితాలు విడుదల చేశారని తెలిపారుని. కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.