Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామారెడ్డి: జిల్లాలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. సోమవారం ఉదయం బిచ్కుంద మండలం పత్లా పూర్ వద్ద యాత్ర మొదలైంది. మరోవైపు నేటితో తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ముగియనుంది. సాయంత్రం 4 గంటలకు మేనూరు గ్రామం వద్ద బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. అనంతరం మహారాష్ట్రలోకి యాత్ర ప్రవేశించనుంది. సరిహద్దుల్లో రాహుల్ యాత్ర బాధ్యతలను మహారాష్ట్ర నేతలకు ప్రవేశించనున్న అప్పగించనున్నారు. రాష్ట్రంలో జరిగే చివరి సభకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు భారీ జనసమీకరణ జరుపుతున్నారు.