Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్లు టీఆర్ఎస్ సోమవారం బహిరంగ ప్రకటన జారీచేసింది. ఈ ప్రకటన టీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ పేరు తో వెలువడింది. పేరు మార్పుపై అభ్యంతరం ఉంటే తెలపాలని ఈ ప్రకటనలో కోరింది. ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి తమ అభ్యంతరాలను, తగిన ఆధారాలను తెలపాలని సూచించింది.పేరు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పేరు మార్చుకునే సందర్భంలో వ్యక్తమయ్యే అభ్యంతరాలనూ పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. ఇందుకోసం ఆయా పార్టీలు ఉన్న రాష్ట్రాలలోని స్థానిక పత్రికలతో పాటు ఆంగ్ల పత్రికలలోనూ ప్రకటనలు ప్రచురించాలి. ఈ నిబంధనతోనే తాజాగా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది.