Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లడం తెలిసిందే. సూపర్-12 దశలో ఐదు మ్యాచ్ లు ఆడిన భారత్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే ఓటమిపాలైంది. మిగతా నాలుగు మ్యాచ్ ల్లో నెగ్గి గ్రూప్ లో అగ్రస్థానంలో నాకౌట్ దశకు చేరింది. ఆ నేపధ్యంలో ఈ నెల 10న జరిగే సెమీఫైనల్లో భారత జట్టు ఇగ్లాండ్ తో తలపడనుంది. దీనిపై టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇంగ్లాండ్ తో పోరు ఓ సవాల్ వంటిదని, పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతామన్నదే కీలకమన్నారు. సెమీస్ మ్యాచ్ జరిగే అడిలైడ్ ఓవల్ లో తాము ఇప్పటికే ఓ మ్యాచ్ ఆడామని, దాంతో ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉందని తెలిపాడు. ఇగ్లాండ్ జట్టుతో తాము ఆడబోయే మ్యాచ్ లో హోరాహోరీ పోరు తప్పదని, ఆ వైపుగా శ్రమిస్తాం అన్నారు.