Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట గురుంచి తెలిసిందే. అదిరిపోయే ఇన్నింగ్స్ తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. విరాట్ కోహ్లీ తాజాగా అక్టోబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం జింబాబ్వే క్రికెటర్ సికందర్ రాజా, దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కూడా పోటీపడగా చివరకు కోహ్లీ ఎంపికయ్యాడు. అక్టోబర్ లో కోహ్లీ కేవలం నాలుగు ఇన్నింగ్స్ లలో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో నాటౌట్ గా 82 పరుగులు చేయడం అత్యద్భుతమని ఈ సందర్భంగా ఐసీసీ తెలిపింది. ఆ మ్యాచ్ లో ఓటమి అంచుల్లో ఉన్న ఇండియాకు కోహ్లీ విజయం వైపు నడిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో ఇండియాను సెమీస్ కు చేర్చడంలో కోహ్లీ కీలక పాత్రను పోషించాడు. అడిలైడ్ లో గురువారం జరిగే సెమీస్ లో ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడబోతోంది.