Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకరపట్నం
శంకరపట్నం మండలం, కొత్తగట్టు గ్రామంలో ఓ పాడి గేద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పాడి రైతు సర్వ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం. పాడి గేదెను ఉదయం స్నానం చేపించి, పశువుల కొట్టంలో కట్టివేయగా, నూతనంగా నిర్మిస్తున్న గృహానికి ఉపయోగించే విద్యుత్ వైరుకు విద్యుత్ ప్రవహించి పశువుల పాక లో ఉన్న పాడి గేదకు తగలడంతో పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందిందని, పాడి గేదే విలువ సుమారు 60 నుంచి 80 వేల రూపాయల వరకు ఉంటుందని, తెలిపారు. విద్యుత్ షాక్ కొట్టి పాడి గేదె మృతి చెందిన పాడి రైతు సర్వ తిరుపతిని ఆర్థికంగా ప్రభుత్వమే ఆదుకోవాలని, శంకరపట్నం ఎంపీపీ ఉమ్మెశీతల సరోజన, గ్రామ సర్పంచ్ మోకిరాల కిషన్ రావు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.