Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ, గాంధారి
గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో తిమ్మాపూర్, రాంపూర్ గడ్డ లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలని గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా NDCCB మరియు IDCMS డైరెక్టర్ పెద్దబూరి సాయికుమార్ కొనుగోలు కేంద్రంలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యని అమ్మి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమములో సొసైటీ డైరెక్టర్లు గాండ్ల లక్ష్మణ్, పయ్యల జనార్దన్ గౌడ్, సొసైటీ సీఈవో మోహన్ రెడ్డి, క్లర్క్ గాండ్ల సాయిలు, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.