Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు జిల్లా నూతన డి ఈ ఈ గా బాధ్యతలు స్వీకరించిన పి నాగేశ్వరరావుకు ములుగు జిల్లా 327 యూనియన్ నాయకులు సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. ములుగు జిల్లా 327 యూనియన్ తరపున ములుగు ఏడిఈ శైలేంద్ర కుమార్ లను యూనియన్ నాయకులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ములుగు జిల్లా 327 యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దండు రామచందర్, ఉదయభాస్కర్ లు యూనియన్ కార్యవర్గాన్ని సభ్యులను ములుగు జిల్లా నూతన
డి ఈ ఈ నాగేశ్వరరావుకు యూనియన్ కార్యవర్గాన్ని సభ్యులను పరిచయం చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించి పరిష్కరించాలని కోరారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులందరూ నూతనంగా నూతన ఉత్సాహంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కే రాజేష్ ఎం వేణు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.