Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ ఏడాది ఏర్పడనున్న రెండో చంద్రగ్రహణం. ఈ నెల ఇంతకు ముందు దీపావళి రోజున సూర్యగ్రహణం సంభవించగా.. 15రోజుల వ్యవధిలోనే కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. ఈ ఏడాది నాలుగు గ్రహణాలు ఏర్పడగా.. ఈ గ్రహణాలు రెండువారాల వ్యవధిలోనే ఏర్పడడం విశేషం. ఈ చంద్రగ్రహణం భారత్తో పాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర ఫసిఫిక్, హిందుమహా సముద్ర ప్రాంతాల్లో కనిపించనుండగా.. ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ 2025 మార్చి 14న ఏర్పడనున్నది.
భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం ప్రపంచవ్యాప్తంగా గ్రహణం కనిపించనున్నది. భారత్లో గ్రహణం సాయంత్ర సమయంలో దర్శనమివ్వనున్నది. దేశంలోని తూర్పు ప్రాంతాలైన కోల్కతా సహా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించే అవకాశం ఉన్నది. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చని, ఎటువంటి పరికరాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే పూర్తిస్థాయిలో ఎర్రగా మారిన చందుడ్రిని చూడొచ్చని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చంద్రగ్రహణం 5.28 గంటలకు, ముంబైలో 6.01 గంటలకు హైదరాబాద్లో 5.40 గంటలకు కనిపించనున్నది.