Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్రాన్ని విడిచి వెళ్లడం బాధగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారన్న ఆయన... దెబ్బలు తాకినా, అనారోగ్యానికి గురైన పట్టుదలతో వారు పనిచేయడం భావోద్వేగానికి గురైనట్లుగా రాహుల్ వెల్లడించారు. దీన్ని మీడియాలో చూపించినా, చూపించకపోయినా తన కళ్లతో చూస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో తనని కలిసిన ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడన్నారు. తెలంగాణ గళాన్ని ఒక చోట నొక్కేస్తే ఇంకో ప్రాంతం నుంచి వినిపిస్తుందని దానిని ఎవ్వరూ అణచివెయ్యలేరన్నారు. ఇక్కడ చేసిన పాదయాత్రను ఎప్పటికీ మరిచిపోనని రాహుల్ తెలిపారు.
తెలంగాణలో విద్యావ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్, మోడీ కలిసి పనిచేస్తున్నారన్న రాహుల్... పార్లమెంట్ లో మోడీ తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు కేసీఆర్ మద్దతు ఇస్తాడన్నారు. వీరిద్దరూ ఒక్కటేనని ఈ విషయాన్ని ప్రజలు ఎప్పుడు మరిచిపోవద్దన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు రుణమాఫీ చేస్తామని, అన్నీ పంటాలకు మంచి మద్దతు ధరను ప్రకటిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.