Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామంలో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చెర్కుపల్లి గ్రామానికి చెందిన ముచ్చపోతుల సైదులు తన భార్య ధనమ్మ ను హత్య చేశాడు. అనంతరం తాను చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహలే ఈ దారుణానికి కారణమని తెలుస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.