Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లోని ఖతౌలి, రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు, మైన్పురి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో డిసెంబర్ 5న ఓటింగ్ నిర్వహించనున్నారు. ఖతౌలి, రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఉపఎన్నిక అనివార్యమైంది. 2013 ముజఫర్నగర్ అల్లర్లలో దోషిగా నిర్ధారణకావడంతో ఖతౌలి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్పై ఈసీ అనర్హత వేటు వేసింది. విద్వేష ప్రసంగాల కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో సమాజ్వాదీ పార్టీ రాంపూర్ ఎమ్మెల్యే అజాంఖాన్పై అనర్హత వేటు పడింది. మైన్పురి ఎంపి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇటీవల కన్నుమూయడంతో అక్కడ కూడా ఉపఎన్నిక అనివార్యమైంది.