Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తిరుపతిలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడవీధిలోని ఓ లాడ్జిలో నిన్న ఉదయం 7 గంటలకు దిగిన వీరిద్దరూ, ఇవాళ ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. యువతీకి ఇటీవల వేరే యువకుడితో పెళ్లి కాగా, ప్రేమ వ్యవహారంతో వీరిద్దరూ ఇలా చేసినట్లు తెలుస్తోంది. యువతి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన అనూషగా గుర్తించగా, యువకుడు హైదరాబాద్ కు చెందిన కృష్ణారావుగా గుర్తించారు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. అసలు ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలను ఛేదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.