Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలతో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ లోని సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీల కార్యాలయాలకు వచ్చిన జగదీశ్ రెడ్డి... ఆ పార్టీ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడా వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డిలతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసినందుకు కమ్యూనిస్టు పార్టీల నేతలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్ రెడ్డి... మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల ప్రచారంతోనే టీఆర్ఎస్ విజయం సాధించిందని చెప్పారు. భవిష్యత్తులోనూ కమ్యూనిస్టులతో కలిసే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ ప్రతిపాదనకు సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు కూడా సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా తెలంగాణను పెద్ద విపత్తు నుంచి కాపాడామనే సంతోషం తమకూ ఉందని ఈ సందర్భంగా కూనంనేని తెలిపారు.