Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున హైదర్గూడలోని జనప్రియ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులోని ఓ ప్లాట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ప్లాట్మొత్తానికి విస్తరించడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో అపార్ట్మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే ప్లాట్ పూర్తిగా దగ్ధమయింది. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తినష్టం జరిగిందని తెలిపారు. కాగా, షార్ట్ సర్య్కూట్తోనే మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు.