Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణ: గన్నవరం కాటా సమీపంలో అపెక్స్ కాస్టింగ్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే విజయవాడ ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. ఇనుమును కరిగించే క్రమంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. విధుల్లో ఉన్న కార్మికులపై అగ్ని రవ్వలు పడడంతో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. పేలుడుపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సంఘటనా ప్రదేశంలో క్లూస్ను సేకరించారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఘటన జరుగగా... గోప్యంగా ఉంచేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రయత్నించింది.