Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్ణాటక: ఇటీవల జరిగిన టెట్ పరీక్ష సందర్భంగా వింత ఘటన బయటకొచ్చింది. పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని హాల్ టికెట్ చూసి అధికారులు షాక్ అయ్యారు. సదరు అభ్యర్థిని హాల్ టికెట్ పై బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫొటో ఉండడమే దీనికి కారణం. వివరాల్లోకి వెళ్తె ఈ నెల 9న కర్ణాటక టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్ 2022) జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. శివమొగ్గలోని రుద్రప్ప కాలేజీలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని హాల్ టికెట్ పై ఇన్విజిలేటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ హాల్ టికెట్ లో అభ్యర్థి ఫొటో ఉండాల్సిన చోట సన్నీలియోన్ ఫొటో ఉండడంతో లోపలికి అనుమతించలేదు. కాలేజ్ ప్రిన్సిపాల్ ను కలిసి విజ్ఞప్తి చేయడంతో పరీక్షకు అనుమతించారు. హాల్ టికెట్ పై సన్నీలియోన్ ఫొటో వ్యవహారంపై రుద్రప్ప కాలేజీ ప్రిన్సిపాల్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ అధికారులు మాత్రం ఇందులో తమ డిపార్ట్ మెంట్ తప్పేమీలేదన్నారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థి అప్ లోడ్ చేసిన ఫొటోతో ఆటోమేటిక్ గా హాల్ టికెట్ జనరేట్ అవుతుందని వివరణ ఇచ్చారు. ఇదే విషయంపై సదరు అభ్యర్థిని ప్రశ్నించగా టెట్ దరఖాస్తు తాను స్వయంగా చేయలేదని, మరొకరితో చెప్పి చేయించుకున్నట్లు తెలిపారు.