Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విలేజ్ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 లక్షల 30 వేల మందికి ఏ నెల జీతం ఆనెల చెల్లించడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. నవంబర్ నెల 9వ తేదీ వచ్చినా రాష్ట్ర ఉద్యోగులకు 30 శాతం మందికి ఇంత వరకు జీతాలు రాలేదన పోలీసు, హెల్త్ డిపార్టుమెంట్లు తప్ప టీచర్లకు, మున్సిపల్, గ్రాంటిన్ ఎయిడ్ ఉద్యోగులకు ఇంతవరకు పెన్షన్లు రాలేదని, ఎప్పుడొస్తాయో తెలియదని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలల నుండి జీతాలు లేవన్నారు. ఆప్కాస్ పేరుతో 99 వేల మంది ఉద్యోగులు రిజిష్టర్ చేయించుకున్నారు. ఒక్క నెలలో కూడా ఆప్కాస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏనెలకు ఆనెల పూర్తిగా జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవని, 80 శాతం జీతాలు ఇచ్చి 20 శాతం టెక్నికల్ సమస్యలు వచ్చాయని దాటవేస్తూ వస్తున్నారని, రెగ్యులర్ గా జీతాలు ఇవ్వలేని ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉందన్నారు. 2022వ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. 2021లో కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో జీతాలు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందనన్నారు. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. రాష్ట్రం కేవలం అప్పులపై ఆధారపడి నడుస్తోంది. అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయి, కార్యదర్శులు, వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులకు ఏనెల జీతం ఆనెల ఇచ్చినట్లు చూపలేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.