Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇటీవల చంద్రబాబు ఆధ్వర్యంలో జ్ఞానేశ్వర్ సైకిలెక్కిన విషయం తెలిసిందే. ఆ తరుణంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలుపాల్గోన్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించే ముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద అమర వీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట ర్యాలీగా పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు తరలివచ్చారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించి టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటి వరకు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులుకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు.