Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. ఈ కేసులో మొదటి రోజు ముగ్గురు నిందితుల కస్టడీ ముగిసింది. ఇవాళ పోలీసులు దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. ముగ్గురు నిందితులను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి ప్రశ్నించారు. మొదటి రోజు కస్టడీ ముగిసిన తర్వాత రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ నుండి నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. రేపు ఉదయం మరోసారి విచారించనున్నారు. అంతకుముందు మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ముగ్గురు నిందితులను ఇవాళ ఉదయం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుండి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కస్టడీలో భాగంగా రామచంద్ర భారతి, నంద కుమార్, సింహాయాజీలను మొదటిరోజు విచారించారు.