Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శుక్రవారం కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ లో దక్షిణాదిన తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మైసూరు-చెన్నై పట్టణాల మధ్య ప్రయాణించనుంది. పారిశ్రామిక కేంద్రం చెన్నై, టెక్నాలజీ, స్టార్టప్ కేంద్రం అయిన బెంగళూరు, ప్రముఖ పర్యాటక పట్టణం మైసూరు మధ్య అనుసంధానతను ఈ రైలు పెంచుతుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. దేశంలో ఇది ఐదో వందే భారత్ రైలు కావడం విశేషం. ఇక భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును కూడా ప్రధాని మోడి ప్రారంభించారు. కాశీని దర్శించుకునే యాత్రికుల కోసం దీన్ని ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. చెన్నై నుంచి మైసూరు వెళ్లడానికి వందే భారత్ లో చైర్ కార్ రూ.1,200, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ కు రూ.2,295 చార్జీ వసూలు చేస్తారు. మైసూరు నుంచి చెన్నైకి ఇవే చార్జీలు 10 శాతం అధికంగా ఉన్నాయి. 500 కిలోమీటర్ల మార్గాన్ని ఈ రైలు ఆరున్నర గంటల్లో చేరుకుంటుంది. మార్గ మధ్యంలో కాట్ పాడి, బెంగళూరు స్టేషన్లలోనే (రెండు స్టాపులు) ఇది ఆగుతుంది. ఈ రైలు రోజువారీ సేవలు రేపటి నుంచి మొదలుకానుంది. చెన్నై నుంచి బెంగళూరుకు మూడు గంటల్లో చేరుకోవచ్చు. అన్ని కోచ్ లకు ఆటోమేటిక్ డోర్లు కలిగి ఉంటాయి. సౌకర్యవంతమైన సీట్లు, వైఫై సదుపాయాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.