Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మెట్రో రైళ్లలో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా ప్రజా రవాణార్థం తీసుకువచ్చిన మెట్రో ట్రైన్లు ఆగిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లక్డీకపూర్ మెట్రో స్టేషన్లో సుమారు 15 నిమిషాల పాటు మెట్రో రైలు నిలిచిపోయింది. ట్రైన్ నిలిచిపోవడానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు చెపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 4 తేదీన రైళ్లు ఉదయం చాలా సమయం పాటు కదల్లేదు. అలాగే సాంకేతిక లోపంతో 45 నిమిషాలకు పైగా మెట్రో రైలు సేవలు నిలిచిపోవడంతో హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సిగ్నలింగ్ వ్యవస్థలో ఏర్పడిన లోపమే ఇందుకు కారణమని తెలుస్తుండగా దాన్ని సరిదిద్దేందుకు మెట్రో అధికారులు శ్రమించినట్లుగా తెలుస్తోంది. సాంకేతిక లోపం కారణంగా మెట్రో సర్వీసులు నిలిచిపోయినట్లుగా, ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.