Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టులో పీఎం మోడీ మీటింగ్ జరుగనుంది. మోడీ పర్యటన నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్ పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమాజిగూడా, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ జుంక్షన్ వరకు ట్రాఫిక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ మార్గాలను అవాయిడ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.