Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రవీంద్ర జడేజా అర్ధాంగి రివాబా జడేజా రాజకీయాల్లో వస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబాకు బీజేపీ టికెట్ కేటాయించింది. రివాబా ఎన్నికల్లో జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండంతో దీనిపై రవీంద్ర జడేజా సోదరి నైనబా జడేజా స్పందించారు.
నైనబా జడేజా కూడా రాజకీయాల్లో ఉన్నారు అయితే ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు. తన సోదరుడి భార్యకు బీజేపీ టికెట్ ఇవ్వడంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రివాబాకు టికెట్ ఇవ్వడం బీజేపీకి బెడిసికొడుతుందని, జామ్ నగర్ లో బీజేపీ ఓ కొత్త ముఖాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది కానీ ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరుతుంది. ఎందుకంటే ఆ కొత్త ముఖానికి అనుభవం లేదు, రాజకీయ కార్యకలాపాలు, పార్టీ శ్రేణులపై అవగాహనలేదన్నారు. కేవలం డబ్బుతోనే ఎన్నికల్లో గెలవొచ్చన్నది ఓ భ్రమ అని నైనబా కొట్టిపారేశారు. జామ్ నగర్ నార్త్ స్థానంపై బీజేపీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకే లభిస్తుందని వ్యాఖ్యానించారు.