Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రధాని మోడీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజిగూడ, మోనప్ప ఐలాండ్, రాజ్భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
పంజాగుట్ట, గ్రీన్ల్యాండ్స్, ప్రకాశ్నగర్ టీ జంక్షన్, రసూల్పురా టీ జంక్షన్, సీటీవో మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు ఉంటుందని చెప్పారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.