Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పాకిస్థాన్ భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్లో తెహ్రీక్-ఎ-తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ ఒబైద్ అలియాస్ మొహమూద్ హతమయ్యాడు. ఒబైద్ తలపై రూ. 50 లక్షల రివార్డు ఉంది. మర్దాన్ జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ అధికారి సబ్ ఇన్స్పెక్టర్ ఫరీద్ ఖాన్ ఆయన ఇంటి ముందే హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఒబైద్ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. అనేక ఉగ్రదాడుల్లోనూ పాల్గొన్న ఒబైద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా పోలీసుల రికార్డులకెక్కాడు. దీంతో ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రభుత్వం గతంలో అతడి తలపై రూ. 50 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వాకు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం పోలీసులు పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలో నిన్న రాత్రి నిర్వహించిన ఆపరేషన్లో ఒబైద్ హతమయ్యాడు. కాగా, ఈ నెల 7న ఖైబర్ జమ్రుద్ తహసీల్ పరిధిలో టీటీపీ కమాండర్, పెషావర్, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుడైన లియాఖత్ను పోలీసులు హతమార్చారు.