Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: డాక్టర్ పోస్టుల భర్తీ ఆలస్యంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఆ తరుణంలో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యులు, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి 10రోజుల్లోపు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక వల్లే డాక్టర్ పోస్టుల భర్తీ ఆలస్యమైందన్నారు. వారం రోజుల్లో 969 పీహెచ్ సీ డాక్టర్ల సర్టిఫికేట్లు వెరిఫై చేసి తొందర్లోనే నియామక పత్రాలు అందజేస్తామన్నారు. 1165 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 6వేలకు పైగా నర్సుల భర్తీతో పాటు 1,569 పల్లె ఆసుపత్రుల్లో డాక్టర్లను నియమిస్తామని వెల్లడించారు. ఇప్పటికే 969 మంది డాక్టర్ల ప్రొవిజినల్ లిస్ట్ విడుదల చేశామని, త్వరలో 3800Aవీ కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మార్చనున్నట్లు తెలిపారు. 4500 పల్లె దవాఖానలో 2900 ఏఎన్ఎమ్ సబ్ సెంటర్లుగా మార్చుతున్నామని, 3800 గ్రామాల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. 1569 పల్లె దవాఖానల్లో పోస్టుల భర్తీ ఎన్నిక వల్ల ఆలస్యం అయ్యిందన్నారు. బస్తీ దవాఖానలను 15వ ఆర్థిక సంఘం ప్రశంసించిందని, రాష్ట్ర వ్యాప్తంగా పల్లె దవాఖానాలను ప్రారంభిస్తామన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనితీరు పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆంతెకాకుండా హైదరాబాద్ కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో తెలంగాణ నజ మానిటరింగ్ హబ్ ను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేత మహంతి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎమ్ఈ రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.