Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హనుమకొండ: జిల్లాలోని కమలాపూర్ మండలం శనిగరం గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారు - ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కమలాపూర్ మండలంలోని గోపాల్ పూర్, గుంటూరుపల్లె గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో పరకాల వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.