Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యూజీ ఆయుష్ వైద్య కోర్సులో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్ వైఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతూ నేడు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుండి 20వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు సూచించారు. నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.Inలో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ప్రకటనలో తెలిపారు.