Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వరుస భూకంపాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా జనం ఇండ్లు, కార్యాలయాల్లో నుంచి బయటకు పరుగులు పెట్టారు. దాదాపు సెకన్ల పాటు తీవ్రమైన ప్రకంపనలు వచ్చాయి. నోయిడా, గురుగ్రామ్ సహా పలుచోట్ల ప్రకంపనలు రికార్డయ్యాయి. గత నాలుగు రోజుల్లో దేశ రాజధాని ప్రాంతంలో భూకంపం రావడం ఇది రెండోసారి. భూకంపం రిక్టర్ స్కేల్పై 5.4 తీవ్రతతో వచ్చాయని, భూకంప కేంద్రం నేపాల్లో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీంతో ఢిల్లీతో పాటు ఉత్తరాధిన పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రికార్డయ్యాయి. ఇదిలా ఉండగా.. నాలుగు రోజుల కిందట నేపాల్లోనే భూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. 6.3 తీవ్రతతో ఢిల్లీలో ప్రకంపనలు రాగా.. నేపాల్లో ఆరుగురు మృతి చెందగా.. ఎనిమిది మందిగాయపడ్డారు. భూకంపానికి సంబంధించి పలువురు ట్వీట్లు పెట్టారు. ప్రకంపనలు తీవ్రంగా ఉన్నాయని ఒకరు ట్వీట్ చేయగా.. భూకంపం భయానకంగా ఉందని మరో యూజర్ ట్వీట్ చేశారు.