Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా కోడూరు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీస ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందిని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.