Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మానకొండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి కాన్వయ్ పై యువకుల దాడి చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకులపై లాఠీఛార్జ్ చేశారు. దీతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతగా మారింది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి లో ఈ ఘటన చోటు చేసుకుంది. డబల్ రోడ్డు నిర్మాణం చేయాలని యువజన సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. అయితే.. వారికి సంఘీభావం తెలిపేందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కవ్వంపల్లి తో పాటు పలువురి ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.