Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నిర్మల్ జిల్లా భైంసాలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ముహమ్మద్ ఫర్హాన్ రెసిడెన్షియల్ కాలేజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భయాందోళనకు గురి చేసింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.