Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. సంతబొమ్మాలి మండలం జగన్నాథపురంలో భార్య ఉమ(52)ను భర్త సింహాద్రి(60) గొంతుకోసి చంపాడు. అనంతరం భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నౌపడ పంచాయతీ జగన్నాథపురంలో శనివారం అర్ధరాత్రి భార్య ఉమను చాకుతో గొంతుకోసి హతమార్చాడు. అనంతరం భర్త కూడా ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న నౌపడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘటనలు జరిగిఉండవచ్చని అనుమానిస్తున్నారు.