Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యలను కేంద్రం పరిష్కరించడంలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజానీకానికి ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ బలరాం నాయక్ స్పందిస్తూ, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఉద్ఘాటించారు. మా పోరాటంతో ఏకీభవించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు అని నాయక్ వెల్లడించారు. సురేష్ షెట్కార్ మాట్లాడుతూ... కేంద్రం, రాష్ట్రంలో బఫూన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునఃప్రారంభం ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల రాజయ్య స్పందిస్తూ, తెలంగాణ కోసం స్వపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషించామని అన్నారు. విభజన హామీల్లో వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసినా, దానిని అమలు చేయలేని దుస్థితి బీజేపీదని తెలిపారు.