Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టర్కీలోని సెంట్రల్ ఇస్తాంబుల్లో శక్తివంతమైన బాంబు పేలుడు చేటుచేసుకుంది. ప్రఖ్యాత ఇస్తిక్లాల్ వీధిలో ఆదివారంనాడు జనంతో రద్దీగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించడంతో ప్రజలు హాహాకారాలు చేశారు. సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఈ పేలుడు ధాటికి సుమారు 11 మంది గాయపడినట్టు టర్కీ మీడియా తెలిపింది. పేలుడు సమాచారం తెలియగానే అంబులెన్స్లు, ఫైర్ ట్రక్కులతో పాటు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తూ, సహాయక చర్యలు చేపట్టాయి. కాగా, పేలుడుకు కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. ఈ పేలుడు ఘటనతో ఇస్తిక్లాల్ ఎవెన్యూలోని దుకాణాలన్నీ మూతపడ్డాయి.