Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీశైలం: పవిత్ర కార్తీకమాసం, ఆదివారం సెలవుదినం కావడంతో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. శ్రీశైలం టోల్గేట్ నుంచి సాక్షిగణపతి ఆలయం వరకు ట్రాఫిక్ స్తంభించింది. సుమారు గంట నుంచి ట్రాఫిక్లో చిక్కుకుని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.