Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: డయాబెటీస్ వాళ్లకోసం ప్రత్యేకంగా ఐదుగురు కాశ్మీర్ యూనివర్సిటీ విద్యార్థులు స్టార్చ్ రైస్ కుక్కర్ని రూపోందించారు. తాము తయారుచేసిన ఈ కుక్కర్కు ఆదివారం పేటెంట్ హక్కులు కూడా తీసుకున్నారు. కాశ్మీర్ యూనివర్సిటీలో చదువుతున్న సాజిద్ నూర్, జహంగీర్ హమిద్, ఇమ్రాన్ నజీర్, అజుర్ హుస్సేన్ అనే నలుగురు విద్యార్థులు, బిలాల్ అహ్మద్ మాలిక్ అనే రీసెర్చ్ టీచర్ ఈ కుక్కర్ని డిజైన్ చేశారు. ఈ ఏడాది జనవరిలో డయాబెటిస్తో బాధపడేవాళ్ల కోసం వీళ్లు ఈ కొత్తరకం కుక్కర్ని రూపొందించారు. వీళ్ల ఆవిష్కరణని మెచ్చుకున్న జమ్యూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా వీళ్లకు ఈమధ్యే అవార్డు ఇవ్వడం విశేషం. అంతే కాకుండా ఈ స్టార్చ్ రైస్ కుక్కర్ ప్రత్యేకత ఏంటంటే ఇది మెసేజ్ సంకేతం ద్వారా అన్నం వండుతుంది. ఉడుకుతున్న సమయంలో పిండిపదార్థం ఎంత ఉంది? అనేది కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ ద్వారా చెప్తుంది. ఈ రైస్ కుక్కర్లో నీళ్లు, బియ్యం కోసం రెండు వేర్వేరు గదులు ఉంటాయి. ఫోన్ నుంచి మెసేజ్ పంపించగానే కుక్కర్ ఆటోమెటిక్గా సరిపడా నీళ్లు, బియ్యం తీసుకుంటుంది. అంతేకాదు అన్నం వండడం పూర్తి అయిన వెంటనే యూజర్లకు మెసేజ్ పంపిస్తుంది. ఈ కుక్కర్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కాకుండా మంబీ అనే సాఫ్ట్వేర్ సాయంతో పనిచేస్తుందని ఈ కుక్కర్ తయారుచేసినవారిలో ఒకరైన సాజిద్ తెలిపారు.