Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూకుడు పెంచారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనున్నది. అలాగే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం జరుగనున్నది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగనున్నది. సమావేశంలో శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతో పాటు టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్ననున్నారు. అయితే, ఈ సమావేశంలో.. బీఆర్ఎస్ విస్తరణ, బీజేపీ పై వ్యూహాలు లాంటి వాటిపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.