Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పక్కింటి పెంపుడు కుక్క కరవడానికి వచ్చిందని తుపాకీతో దానికి కాల్చి చంపిన సంఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్లీ తాలూకా ధరవాతి తండా ప్రాంతంలో వికాస్ బన్సోడి అనే వ్యక్తి కుక్కను పెంచుకుంటున్నాడు. పక్కింటి వ్యక్తి వెళ్తుండగా కుక్క మొరగడంతో దానిని అతడు తుపాకీతో కాల్చి చంపాడు. వికాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపిసి 428 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.