Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వాట్సాప్ ఇటీవలే ఒక గ్రూపులో సభ్యుల సంఖ్యను 256 నుంచి 1,024కు పెంచడం తెలిసిందే. అదే తరుణంలో మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంన్నది. గ్రూప్ లో సభ్యుల సంఖ్య 256కు మించితే మ్యూట్ ఆన్ అయిపోతుంది. అటువంటప్పుడు సదరు గ్రూపు నోటిఫికేషన్లు కనిపించవు. ప్రస్తుతం ఈ ఫీచర్ ను బీటా టెస్టర్ల పరిధిలో పరీక్షిస్తోంది. ఇలా సభ్యుల సంఖ్య 256 దాటినప్పుడు దానంతట అదే వాట్సాప్ చాట్ నోటిఫికేషన్లను మ్యూట్ చేస్తుంది. దీనివల్ల అదనపు నోటిఫికేషన్ల బెడద వదులుతుంది. దీంతో చాలా మందికి ప్రశాంతత ఏర్పడనుంది. నోటిఫికేషన్లు యథావిధిగా రావాలని భావిస్తే గ్రూపు సెట్టింగ్స్ లో అన్ మ్యూట్ చేసుకోవాలని తెలుస్తుంది.