Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ప్రియురాలిని 35 ముక్కలుగా నరికిన సంఘటన ఢిల్లీనగరంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, న్యూఢిల్లీకి చెందిన శ్రద్ధ, అఫ్తాబ్ అమీన్ పూనావల్లా ఇద్దరు ప్రేమికులు గత కొన్ని రోజులు సహజీవనం చేశారు. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ, అఫ్తాబ్ అమీన్ పూనావల్లాను వేడుకోవడంతో ఆగ్రహానికి లోనైన అఫ్తాబ్ శ్రద్ధను హతమార్చాడని తెలుస్తుంది. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి 18 రోజుల పాటు ఢిల్లీలోని మెహ్రౌలీ అడవుల్లో పడేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మే 18న ఈ హత్య జరుగగా, తాజాగా ఈ కేసులో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అఫ్తాబ్ అమీన్ పూనావల్లా రిమాండ్ లో ఉన్నాడు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.