Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్యప్రదేశ్: సింగ్రౌలీ జిల్లాలో ఇవాళ మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 3.2తీవ్రతతో భూకంపం మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఇవాళ ఉదయం పంజాబ్లోనూ భూకంపం సంభవించింది. అయితే, భూకంప కేంద్రం పాక్లో గుర్తించినట్లు ఎన్సీఎస్ తెలిపింది. అమృత్సర్లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) తెలిపింది. తెల్లవారుజామున 3:42 గంటలకు ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. ఈ నెల 12న రాత్రి 8 గంటల ప్రాంతంలో డిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రిక్టర్ స్కేల్పై 5పైగా తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.