Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా బస్ ఇంజిన్లో మంటలు చెలరేగి ప్రైవేటు బస్సు దగ్ధమైంది. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో.. ప్రయాణికులను దించివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. మంటల్లో పూజా ట్రావెల్స్కు చెందిన ఎల్హెచ్ 40 ఏటీ 9966 బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో 29 మంది ప్రయాణికులు ఉన్నారు.