Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మాలయా స్టూడియో అధినేత, మాజీ ఎంపీ, పద్మభూషణ్ కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి - 79) మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సంతాపం ప్రకటించారు.
350కి పైగా సినిమాలలో నటించిన అగ్రశ్రేణి నటుడు తెలుగు సినిమా పరిశ్రమలో అనేక ప్రయోగాలతో నూతన ఒరవడిని సృష్టించారు. తెలుగు సినిమా పరిశ్రమకు 50 ఏండ్ల పాటు సేవలు అందించారు.
తెలుగు సినీమా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటని వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.