Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సెంట్రల్ రైల్వే కల్యాణ్ సెక్షన్లోని సీఎస్టీ ముంబై-మసీద్ స్టేషన్ల మధ్య ట్రాఫిక్-పవర్ బ్లాక్ కారణంగా నవంబర్ 19, 20 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్టు, మరికొన్నింటిని దారి మళ్లించినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. నవంబర్ 19న హైదరాబాద్-సీఎస్టీ ముంబై రైలు (12702), సికింద్రాబాద్-సీఎస్టీ ముంబై (17058), 20న సీఎస్టీ ముంబై- హైదరాబాద్, (12701), సీఎస్టీ ముంబై-సికింద్రాబాద్ రైలు (17057)ను రద్దు చేశారు. 19,20 తేదీల్లో హెచ్ఎస్. నాందేడ్- సీఎస్టీ ముంబై (17618), 20,21 తేదీల్లో సీఎస్టీ ముంబై-హెచ్ఎ్స.నాందేడ్ రైలు (17617), 20న సీఎస్టీ ముంబై-జాల్నా (12071), జాల్నా-సీఎస్టీ ముంబై (12072), సీఎస్టీ ముంబై- ఆదిలాబాద్ రైలు (11402), 19న హెచ్ఎస్. నాందేడ్- సీఎస్టీ ముంబై రైలు (17611), 20న సీఎస్టీ ముంబై- హెచ్ఎస్.నాందేడ్ రైలు (17612)ను, 21న ఆదిలాబాద్- సీఎస్టీ ముంబై (11401) రైలును రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. 20న సీఎస్టీ ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు (22732) దాదర్ నుంచి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలియజేశారు.