Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నేడు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ తో జాకీ మాతృసంస్థ పేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ తరుణంలో ప్రముఖ అండర్ వేర్ గార్మెంట్స్ ఉత్పత్తిదారు జాకీ తెలంగాణలో పరిశ్రమ స్థాపించనున్నట్లు తెలుస్తుంది. ఎంతో ప్రజాదరణ పొందినలో దుస్తుల సంస్థ జాకీ తెలంగాణలో రెండు చోట్ల పరిశ్రమలు స్థాపించనుందని, ఇబ్రహీంపట్నం, ములుగు ప్రాంతాల్లో జాకీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పనుందని కేటీఆర్ తెపారు. 1 కోటి లో దుస్తులు ఉత్పత్తి చేయనుందని, జాకీ ఫ్యాక్టరీలతో 7 వేల ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను కేటీఆర్ ట్విట్టర్లో ద్వారా తెలిపారు.