Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొమురం భీం: ఖానాపూర్ అటవీ ప్రాంతంలో పులి దాడిలో గిరిజనుడు సిడాం భీము మరణించిన ఘటనపై అటవీశాఖ విచారణ చేపట్టింది. అటవీ మార్గంలో 20 కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. పులి కదలికలను గుర్తించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా అటవీశాఖ అధికారి దినేష్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దాడి జరిగిన తీరును బట్టి పులి కాకపోవచ్చని అటవీశాఖ అంచనా వేస్తోంది. మృతుడి రక్త నమూనాలు, వెంట్రుకలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అటవీ గ్రామాల ప్రజలు ఒంటరిగా పంట చేలకు వెళ్ళొద్దని అటవీ అధికారుల సూచించారు.