Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇరాన్లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి, మహిళ, పోలీసు ఉన్నారు. ఇరాన్కు చెందిన ఐఆర్ఎన్ఏ వార్తా ఛానెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కాల్పుల ఘటన నైరుతి ఇరాన్లోని ఇజే సిటీలో జరిగింది. కాల్పులకు ఇంతవరకు ఎవరూ బాధ్యత వహించలేదు.
ఇజే నగరంలోని మార్కెట్లో మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సెంట్రల్ మార్కెట్లో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉంటారు. సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తున్నది. తొలుత అక్కడి జనితేవార్, ఓ సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో మొత్తం ఐదుగురు చనిపోయారు. మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఒక చిన్నారి, మహిళ, పోలీసు ఉన్నారు.