Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరుసగా రెండు రోజుల పాటు లాభాలను మూటకట్టుకున్న స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. వారాంతపు డెరివేటివ్స్ ఎక్స్ పైరీ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి తోడు చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు కోల్పోయి 61,750కి పడిపోయింది. నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 18,343 వద్ద స్థిరపడింది.